అమరన్తో అదరగొట్టింది.. కానీ అక్కడ దొరికిపోయిన సాయి పల్లవి  
                                       
                  
				  				   
				   
                  				  2022లో రిలీజైన "మేజర్"ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అడవి శేష్ టైటిల్ రోల్ పోషించిన ఈ రియల్ లైఫ్ బయోపిక్ మంచి విజయం సాధించింది. హీరోయిన్ కారణంగా ఈ సినిమా కలెక్షన్ల పరంగా కాస్త వెనక్కి తగ్గిందని టాక్. 
				  											
																													
									  
	 
	తాజాగా అమరన్లో మాత్రం థియేటర్ నుంచి బయటికి వచ్చాక కూడా వెంటపడే స్థాయిలో సాయిపల్లవి హృదయాలను బరువెక్కించింది. ఫైనల్ రన్లో రెండు వందల కోట్ల గ్రాస్ సులభంగా దాటుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి.
				  
	 
	ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రజలకు మన ఆర్మీ టెర్రరిస్ట్లలా కనిపిస్తుంది. మనకు వాళ్ల ఆర్మీ అలా కనిపిస్తుంది. ఇక్కడ చూసే విధానం వల్ల అంతా మారిపోతుంది. అందులో ఎవరు రైట్, ఎవరు తప్పు అనేది చెప్పలేం' అన్నారు సాయిపల్లవి. ఈ కామెంట్సే ఇప్పుడు సాయి పల్లవిని చిక్కుల్లో పడేశాయి. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	అమరన్ ప్రమోషన్స్కు ముందు నుంచే కొంత మంది నెటిజెన్స్ సాయి పల్లవిని టార్గెట్ చేశారు. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఈ బ్యూటీ నేషనల్ వార్ మెమోరియల్లో నివాళి అర్పించినా... నెటిజెన్స్ మాత్రం ఈ బ్యూటీని క్షమించలేదు. ప్రజెంట్ బాయ్కాట్ సాయి పల్లవి అనే హ్యాష్ ట్యాగ్ నేషనల్ లెవల్లో ట్రెండ్ అవుతోంది.