శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2016 (14:07 IST)

''సర్దార్''తో నష్టాలు.. మెగా హీరోలకు షాక్.. నిహారిక, సాయిధరమ్ సినిమాలు ఏమౌతాయో?!

''సర్దార్ గబ్బర్ సింగ్'' ఫ్యాన్స్‌కు నిరాశను మిగిల్చింది. మరోవైపు మెగా ఫ్యామిలీకి షాక్ ఇచ్చింది. కలెక్షన్లు లేకపోవడంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టింది. సర్దార్ గబ్బర్ సింగ్ చివరకు నష్టాల్నే మిగిల్చింది. రోజురోజుకు పడిపోతున్న ఈ సినిమా డ్రాప్ కలక్షన్స్ ప్రభావంతో ఈ సినిమాకు ఏకంగా సుమారు రూ.95 కోట్ల నష్టం వచ్చిందని సినీ వర్గాల్లో టాక్.
 
ఇప్పటికీ సర్దార్ అమెరికాలో 55 స్క్రీన్లలో ప్రదర్శించబడుతున్నప్పటికీ.. కలెక్షన్ల విషయానికి వస్తే.. కేవలం 20,807 డాలర్స్ మాత్రమే వచ్చాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు అమెరికాలో ఏ తెలుగు టాప్ హీరో సినిమాకు రాని స్థాయిలో అత్యంత తక్కువ స్థాయి కలక్షన్స్ ఈ సినిమాకు రావడంతో ఒక్క అమెరికా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‌కే దాదాపు రూ.4.5 కోట్ల నష్టం వచ్చిందని తెలుస్తోంది. 
 
ఇకపోతే.. సర్దార్ ఫట్ కావడంతో పాటు చెర్రీ బ్రూస్ లీ సైతం కలెక్షన్స్ లేకపోవడంతో బయ్యర్లు భయపడుతున్నారు. దీనికి తోడు గత రెండు రోజులుగా టాలీవుడ్‌కి హాట్ టాపిక్‌గా మారిన ‘లోఫర్’ సినిమా బయ్యర్ల వ్యవహారం కూడ ఒక మెగా యంగ్ హీరో సినిమా గురించే కావడంతో మెగా కుటుంబం సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ పరిస్థితుల ప్రభావం చిరంజీవి నటించబోయే 150వ సినిమాపై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదని సినీ పండితులు అంటున్నారు. అందువల్లనే చిరంజీవి తన ‘కత్తి’ రీమేక్ వ్యవహరాన్ని ఆపుచేసి దర్శకుడు వినాయక్ చెప్పన మరో లేటెస్ట్ కథ గురించి ఆలోచిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 
 
మొత్తానికి మెగా హీరోలు, వారి సినిమాలు, కలెక్షన్లు గందరగోళంగా ఉన్నాయి. అయితే మెగా హీరోయిన్ నిహారిక మాత్రం తన సినిమాకు మంచి కలెక్షన్స్ కొట్టేయాలని ఉవ్విళ్లూరుతోంది. అలాగే సుప్రీమ్ సినిమాతో మెగా హీరో సత్తా ఏంటో నిరూపించుకునేందుకు సాయిధరమ్ తేజ్ రెడీ అవుతున్నాడు. మరి వీరిద్దరి సినిమాలు వర్కౌట్ అయితే.. చిరంజీవి ముందు వెనకా ఆలోచించకుండా.. 150వ సినిమాపై పూర్తిగా దృష్టి సారిస్తారని తెలుస్తోంది.