నన్ను అన్ని విధాలుగా ఎంకరేజ్ చేసింది టాలీవుడ్ మన్మథుడే : నటి శ్రియ
టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జునకు నటి శ్రియ గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి అవకాశాలు లేని సమయంలో శ్రియకు మనం చిత్రంలో కింగ్ మంచి పాత్ర ఇచ్చి తెలుగు ప్రేక్షకులు మరిచిపోకుండా చేశారు. తాజాగా కింగ్పై ప్రశంసల వర్షం కురిపించింది.
సినిమా ఇండస్ట్రీలో ఎదుట వాళ్లను బుట్టలో వేసుకోవాలంటే.. ఫస్ట్ జపించేది పొగడ్తల మంత్రమే. ఇది తెల్సుకున్న బ్యూటీలకు ఇండస్ట్రీలో ఎదురే ఉండదు. అవును.. గ్లామర్ ఫీల్డ్లో మూడు నాలుగేళ్లకే ఫెయిడ్ అవుట్ అవుతున్నా కొందరు బ్యూటీలకు ఛాన్స్లు వస్తున్నాయంటే కారణం ఇదే. ఈ పవర్పుల్ మంత్రాన్ని ఒడిసిపట్టిన శ్రియా శరణ్ చిలుక పలుకులు పలుకుతోంది. తనకు ఇప్పటికీ ఇష్టమైన హీరో నాగార్జునే అంటోంది.
తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తల్లో 'సంతోషం' మూవీలో అవకాశం ఇచ్చి అన్ని విధాలుగా ప్రోత్సహించారన్నారు. ఆతర్వాత కూడా చాలా సినిమాల్లో ఆఫర్స్ నాగార్జున సార్ ఇప్పించారని పొగడ్తల వర్షం కురిపించింది. ఛాన్స్లు రావని, శ్రియా పనైపోయిందని అందరు అనుకుంటున్నప్పుడు 'మనం'లో ఛాన్స్ ఇచ్చారు. 'మనం'లో కేరక్టర్కు నేనే సూట్ అవుతానని డైరెక్టర్ విక్రమ్ కుమార్తో అన్నారట. దీంతో తనకు అవకాశం కల్పించారని చెప్పారు. ఈ బ్యూటీ నటించిన 'దృశ్యం' హిందీ వర్షన్ ఇంటర్వ్యూలో పై విధంగా వ్యాఖ్యానించింది.