1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 18 మే 2019 (16:30 IST)

అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సోనీ చరిష్టా

బాలీవుడ్ నటీమణుల్లో సోనీ చరిష్టా ఒకరు. ఈమె తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. పైగా, ఇతర హీరోయిన్లకూ తీసిపోని అందం, అభినయం ఆమె సొంతం. అలా ఆమెకు అన్నివున్నా.. అదృష్టం మాత్రం కలిసిరావడంలేదు. అందుకే సౌత్ మూవీ ఇండస్ట్రీపై దృష్టిసారించింది. 
 
తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్, జె.డి.చక్రవర్తి, రాధికా కుమారస్వామి (కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి), కళాతపస్వి కె.విశ్వనాథ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువ దర్శకుడు ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వంలో సమీర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఫరీన్ ఫాతిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి తెలుగులో 'ఇద్దరు' అనే పేరు పెట్టినట్టు సమాచారం. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, గోవా, థాయిలాండ్‌లలో షూటింగ్ జరుపుకున్న 'ఇద్దరు' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొంటోంది. యాక్షన్ ఎపిసోడ్స్‌తోపాటు థ్రిల్లింగ్ అంశాలతో సాగే హృద్యమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న 'ఇద్దరు' చిత్రం తనకు మరింత పేరు తెస్తుందని ఆశిస్తున్నానని సోనీ చెబుతోంది.
 
ఈ చిత్రం కాకుండా హిందీ, కన్నడ భాషల్లోనూ నటిస్తున్నానని, తెలుగులో త్వరలోనే ఒక మంచి సినిమాకు సైన్ చేయనున్నానని సోనీ తెలిపారు. ఈ చిత్రంలో హేమాహేమీలతో నటించడం చాలా గర్వంగా ఉందని, చిత్ర దర్శకుడు ఎస్.ఎస్. సమీర్, నిర్మాత ఫరీన్ ఫాతిమాలకు తాను ఎప్పటికి రుణపడి ఉంటానని సోనీ పేర్కొంది.