1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 10 మార్చి 2020 (21:27 IST)

సుకుమార్, ఆ సీన్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేసాడా?

క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. అల.. వైకుంఠపురములో సినిమా సెట్స్ పైన ఉండగానే.. సుకుమార్‌తో సినిమాని స్టార్ట్ చేసాడు బన్నీ. సుకుమార్ అల్లు అర్జున్ లేకుండా మిగిలిన ఆర్టిస్టులతో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసాడు. సెకండ్ షెడ్యూల్ కేరళలో ప్లాన్ చేసాడు. త్వరలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నాడు.
 
అయితే.. సుకుమార్ ఇప్పటివరకు చేసిన ఈ సినిమా షూటింగ్‌ని అంతా క్యాన్సిల్ చేసారట. కారణం ఏంటంటే... తీసిన ఆ సీన్స్ సరిగా రాలేదట. ఈ విషయాన్ని సుకుమార్ బన్నీకి చెప్పగా.. ఓకే అన్నారట. ప్రస్తుతం మళ్లీ ఫస్ట్ నుంచి షూటింగ్ చేయడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ.. సుకుమార్ కానీ బన్నీ కానీ ఈ విషయం క్లారిటీ ఇవ్వలేదు.
 
బన్నీ సరసన రష్మిక నటిస్తుంది. త్వరలో రష్మిక కూడా ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ కానుంది. 
వీరిద్దరిపై చిత్రీకరించే సన్నివేశాలు యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయని సమాచారం. జగపతిబాబు, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారని టాక్. దీనికి శేషాచలం అనే టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి కానీ.. ఆ తర్వాత ఆ వార్తలు వాస్తవం కాదు.. టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదని చెప్పారు. మరి.. ఏ టైటిల్ పెడతారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.