గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (17:10 IST)

సుమన్ కీలక పాత్రలో యధార్ధ ఘటన ఆధారంగా 'ప్రేమభిక్ష'

శ్రీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో అనిల్‌, శృతిలయ హీరోహీరోయిన్‌లుగా, ఎం.ఎన్‌. బైరారెడ్డి, నాగరాజు నిర్మాతలుగా, ఆర్‌.కె. గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ప్రేమభిక్ష'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధ

శ్రీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో అనిల్‌, శృతిలయ హీరోహీరోయిన్‌లుగా, ఎం.ఎన్‌. బైరారెడ్డి, నాగరాజు నిర్మాతలుగా, ఆర్‌.కె. గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ప్రేమభిక్ష'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ అనంతపురం జిల్లా భద్రపట్నం అనే గ్రామంలో జరిగిన యధార్ధ ఘటనను తీసుకుని దర్శకుడు గాంధీ ఓ మంచి కథను తయారు చేశాడు. సగానికి పైగా టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పూర్తి టాకీ ఈ నెల 25 వరకు కోలార్‌లో జరుగుతున్న షెడ్యూల్‌తో కంప్లీట్ అవుతుంది అని చెప్పారు. 
 
దర్శకుడు ఆర్.కె.గాంధీ మాట్లడుతూ ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా:దేవిశ్రీ గురూజీ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని అన్నారు. అలాగే ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ మా చిత్రంలో నటించడం మాకు గర్వకారణమన్నారు. నవంబర్ ప్రథమార్థంలో ఆడియో ఆవిష్కరణ జరపనున్నట్టు చెప్పారు. 
 
ఇందులో అనిల్‌, శృతిలయ, సుమన్‌ ,కవిత, డా: దేవిశ్రీ గురూజీ, షఫీ, రాజేంద్ర, కింగ్‌ మోహన్‌, కిల్లర్‌ వెంకటేష్‌, జ్యోతి మొదలగు వారు నటిస్తున్న ఈ చిత్రానికి స్టంట్స్‌: శంకర్‌, కొరియోగ్రఫీ: ఎస్‌.ఎస్‌.కె. సందీప్‌, పాటలు: ఘంటాడి కృష్ణ, రామ్‌ పైడిశెట్టి; సంగీతం: ఘంటాడి కృష్ణ, కెమెరా: ప్రమోద్‌. ఆర్‌; నిర్మాతలు: ఎం.ఎన్‌. బైరారెడ్డి, నాగరాజు; కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్ వం :ఆర్‌.కె.గాంధీ.​