శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2015 (14:27 IST)

భటుడిగా మారిన సునీల్: మన్నారా చోప్రా హీరోయిన్.. మాస్ రాజాగా?

సునీల్ భటుడిగా తెరమీద కనిపిస్తున్నాడు. సునీల్ కథానాయకుడిగా ఆర్.పి.ఎ.క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కిస్తున్న చిత్రానికి `భటుడు` అనే పేరు పెట్టారని సమాచారం. ఇందులో ప్రియాంక చోప్రా చెల్లెలు మన్నారా చోప్రా కథానాయికగా నటిస్తోంది. సునీల్ ఇప్పటి వరకు మార్క్ మాసిజం టైటిల్‌లో కనిపించలేదు. ఈ సినిమాలో దమ్ముండే రోల్‌లో సునీల్ కనిపిస్తాడని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం దిల్‌రాజు నిర్మిస్తున్న వాసు వర్మ చిత్రం `కృష్ణాష్టమి`లో నటిస్తున్నాడు సునీల్. ఆ సినిమా చివరి దశకు చేరుకొంటుండంతో `భటుడు`ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేశాడు. భీమవరం బుల్లోడు తర్వాత సునీల్‌కి బాగా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌ని పూడ్చేలా ఇకపై వేగంగా సినిమాలు చేయాలనుకొంటున్నాడట. `భటుడు` తర్వాత గోపిమోహన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సునీల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.