శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : మంగళవారం, 3 మే 2016 (15:09 IST)

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు మే 5న ''దాసరి-శృతిలయ స్వర్ణకంకణం 2016''

దర్శకరత్న దాసరి నారాయణరావు తన ప్రియశిష్యుడు మోహన్ బాబుకి విలువైన గిఫ్ట్‌ని అందజేయనున్నారు. మే నెల 5న దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా శృతిలయ ఆర్ట్స్ అకామి సండస్థ ప్రతి సంవత్సరం స్వర్ణకంకణాన్ని ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం ఆ అరుదైన గౌరవాన్ని దాసరి నారాయణరావు శృతిలయ స్వర్ణకంకణాన్ని ప్రముఖ సినీనటుడు, నిర్మాత డాక్టర్ ఎం మోహన్ బాబుకి అందచేయాలని నిర్ణయించుకున్నారు. 
 
మే 5న హైద్రాబాద్ రవీంద్ర భారతిలో జరిగే ఈ కార్యక్రమంలో తెలుగు సినిమా బహుముఖ ప్రజ్ఞా కథానాయకుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ''దాసరి-శృతిలయ స్వర్ణకంకణం 2016'' పురస్కారాన్ని బహుకరిస్తామని స్వర్ణ కంకణ ముఖ్య సలహాదారులు కె.ధర్మారావు సగౌరవంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మెహమూద్ ఆలీ, ఎంపీ సుబ్బిరామిరెడ్డి, ప్రముఖ హిందీ నటుడు శత్రుఘ్న సిన్హా, నందమూరి బాలకృష్ణ, తదితరులు పాల్గొంటున్నారు.