పవన్ ట్వీట్లతోనే సరిపెడుతున్నారు : తమ్మారెడ్డి భరద్వాజ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై టాలీవుడ్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ సెటైర్లు వేశారు. ఏదేని అంశంపై ట్వీట్లతో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చే పవన్... వాటితోనే సరిపెట్టుకుంటున్నారన్నారు. తమిళనాడులో తెలుగు బోధనను కొనసాగించేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉద్యమం చేయనున్నట్టు లోగడ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. తర్వాత దాని గురించి ఊసేలేదు.
వీటిపై తమ్మారెడ్డి భరద్వాజ్ శుక్రవారం స్పందించారు. పవన్ ఆ ఉద్యమంపై ఎందుకు వెనక్కి తగ్గారో తెలియదన్నారు. ఆయన గనుక ఆ ఉద్యమంలో పాల్గొంటే చైతన్యం వస్తుందని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో తెలుగు బోధనను కొనసాగించకపోతే రక్తాక్షరాలతో ఉద్యమం చేపడతామని సీబీఐ జాతీయ కమిటీ సభ్యుడు నారాయణ ప్రకటించారు.
ఇదిలాఉంటే తమిళనాడులో తెలుగు బోధనను కొనసాగించాలని ఉత్తరాల ఉద్యమం చేయబోతున్నట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి తెలుగు బోధన కొనసాగేలా చూడాలని కోరారు.