బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: శనివారం, 16 జూన్ 2018 (12:11 IST)

బెజ‌వాడ దుర్గమ్మ ఆలయంలో తేజ్ టీమ్ ప్ర‌త్యేక పూజ‌లు..!

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం తేజ్ ఐ ల‌వ్ యు. ఈ చిత్రానికి క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్ పై కె.ఎస్.రామారావు ఈ సినిమాని నిర్మించారు. తేజ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించింది. ఇట

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం తేజ్ ఐ ల‌వ్ యు. ఈ చిత్రానికి క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్ పై కె.ఎస్.రామారావు ఈ సినిమాని నిర్మించారు. తేజ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించింది. ఇటీవ‌ల మెగాస్టార్ చేతుల మీదుగా రిలీజైన ఆడియోకు మంచి స్పంద‌న ల‌భిస్తోంది.ఈ చిత్రాన్ని ఈ నెల 29న రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ... కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. 
 
జూలై 6న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే... ఆడియో సాధించిన విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని ఆడియో స‌క్స‌స్ మీట్‌ను ఈ రోజు విజ‌య‌వాడ ట్రెండ్ సెట్ మాల్‌లో ఘ‌నంగా జ‌రిపేందుకు ప్లాన్ చేసారు. విజ‌య‌వాడ‌కు చేర‌ుకున్న తేజ్ టీమ్ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు.
 
హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, డైరెక్ట‌ర్ క‌రుణాక‌ర‌న్ త‌దిత‌రులు తేజ్ చిత్రం విజయవంతం కావాలని అమ్మవారికి ప్ర‌త్యేక పూజలు చేసారు. మ‌రి... జులై 6న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న తేజ్ సినిమా అంద‌ర్నీ ఆక‌ట్టుకుని విజ‌యం సాధిస్తుంద‌ని టీమ్ చాలా న‌మ్మ‌కంగా ఉన్నారు.