శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2016 (18:21 IST)

రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ మార్కెట్లో కూరగాయలు అమ్మింది.. ఎందుకో?

రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రస్తుతం యమా క్రేజ్. కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోలతో నటించేస్తున్న ఈ భామ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ''కేపీహెచ్‌బీలో నేను కూరగాయలు అమ్ముతా, ఉదయం 10 గంటల నుంచి నా దగ్గరకు వచ్చి కూరగాయలు కొనుక్కోండి'' అంటూ రకుల్ చేసిన ట్వీట్కు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. చెప్పినట్లుగానే శనివారం ఉదయం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో మంజీరా మాల్ ఎదురుగా ఉన్న మార్కెట్‌లో రకుల్ కూరగాయలు అమ్మింది.
 
అయితే రకుల్ ప్రీత్ సింగ్ కూరగాయలు అమ్ముకునే అవసరం ఏమొచ్చిందని అందరూ అనుకున్నారు. అయితే సినిమాలతో పాటు టీవీ షోలకు మంచి రేటింగ్ వస్తున్న తరుణంలో మంచు లక్ష్మి.. 'మేము సైతం' పేరుతో మరో టివి షో ప్రారంభిస్తుంది. సమాజ సేవ నేపథ్యంతో రూపొందించిన ఈ కార్యక్రమం కోసం రకుల్ ప్రీత్సింగ్ ఈ రిస్క్ తీసుకుంటుంది. 
 
ఇలా రకుల్ అమ్మిన కూరగాయల ద్వారా వచ్చిన డబ్బును ఏదైనా సామాజిక సేవా కార్యక్రమం కోసం వినిగయోగిస్తారని తెలిసింది. ఇలా రకుల్ ప్రీత్ సింగే కాదు.. టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా మేము సైతం అంటూ ఏదో ఆసక్తికరమైన పనులు చేస్తూ.. మెరిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఇలా కూరగాయలు అమ్మడంతో వచ్చే నగదును చెన్నై వరద బాధితులకు పంపనుందని తెలిసింది.