శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 25 జనవరి 2018 (18:09 IST)

''టచ్ చేసి చూడు'' ట్రైలర్: ''ఐ యామ్ క‌మింగ్'' అంటోన్న మాస్ మహారాజ

మాస్ మహారాజ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్‌గా నటించిన ''టచ్ చేసి చూడు'' సినిమా ట్రైలర్ గురువారం రిలీజైంది. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. సీరత్ కపూర్ రెండో కథానాయికగా నటిస్తోంది. విక్ర‌మ్ సిరికొండ ద

మాస్ మహారాజ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్‌గా నటించిన ''టచ్ చేసి చూడు'' సినిమా ట్రైలర్ గురువారం రిలీజైంది. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. సీరత్ కపూర్ రెండో కథానాయికగా నటిస్తోంది. విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమా ట్రైలర్.. రవితేజ ఫ్యాన్సును అలరిస్తోంది. 
 
'ఫ్యామిలీ అంటే ఓష‌న్ ఆఫ్ ఎమోష‌న్స్' అని చెప్ప‌డంతో పాటు సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ర‌వితేజ చెప్పిన డైలాగ్‌లు అదుర్స్ అనిపించాయి. చివ‌రి పంచ్‌గా ''ఐ యామ్ క‌మింగ్'' అని ర‌వితేజ చెప్ప‌డం అభిమానుల‌ను అల‌రిస్తుంది. 
 
"కరెక్ట్‌గా డ్యూటీ చేస్తే రెండు రెండే నిమిషాల్లో కేస్ సాల్వ్ చేయొచ్చు. యూనిఫామ్‌లో వుండే ఆరే బుల్లెట్లు యూనిఫామ్ తీసేస్తే రాయితో చంపుతానో రాడ్‌తో చంపుతానో నాకే తెలియదంటూ" రవితేజ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఇక సుహాసిని, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, అజ‌య్ త‌దిత‌రులు ఈ చిత్రంలో ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.