గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 19 జులై 2019 (15:55 IST)

'ఆర్ఆర్ఆర్' నిర్మాతనని చెప్పి మహిళా న్యాయవాదికి టోకరా

దర్శధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి - జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ  చిత్రం వచ్చే యేడాది జూలై ఆఖరులో విడుదలకానుంది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సుమారుగా రూ.250 నుంచి రూ.300 కోట్ల మేరకు ఖర్చు పెడుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 
 
అయితే, ఈ చిత్రంలో తల్లిపాత్రలో వేషం ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళా న్యా యవాదిని ఓ వ్యక్తి మోసం చేశాడు. అదీకూడా తాను ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాతనంటూ నమ్మించి రూ.50 లక్షల మేరకు టోకరా పెట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, బంజారాహిల్స్‌లో ఓ కలర్ ల్యాబ్‌లో వీరబత్తిన నరేష్ కుమార్ పని చేస్తున్నాడు. ఈయన బోయిన్‌పల్లికి చెందిన 73 యేళ్ల వయస్సున్న మహిళా న్యాయవాదితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత తాను ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాతనని చెప్పి ఆమెను నమ్మించాడు. పైగా, రాజమౌళితో మాట్లాడి ఆర్ఆర్ఆర్ చిత్రంలో తల్లిపాత్ర వేషం ఇప్పిస్తానని చెప్పడంతో ఆమె నమ్మేసింది. 
 
ఇలా గత నాలుగు నెలల్లో రూ.50 లక్షలను లాగేశాడు. ఆ తర్వాత షూటింగ్‌కు ఎపుడు తీసుకెళుతున్నారని ఆ మహిళా న్యాయవాది ప్రశ్నించడంతో నరేష్ కుమార్ ఎదురుదాడికి దిగాడు. పైగా, ఫోన్ స్వీచాఫ్ చేశాడు. దీంతో ఆమె బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మోసగాడికోసం గాలిస్తున్నారు.