శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 జూన్ 2017 (11:02 IST)

నల్లద్దాలు.. మాసినగెడ్డం... తలకు టోపీ... బాబా వేషంలో వచ్చి డీజే చూసిన హీరో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాలతార పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం "డీజే.. దువ్వాడ జగన్నాథం". ఈ చిత్రం ఈనెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాలతార పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం "డీజే.. దువ్వాడ జగన్నాథం". ఈ చిత్రం ఈనెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రాన్ని విడుదల రోజే తిలకించాలని టాలీవుడ్ యువ హీరో ఒకరు భావించారు.
 
అయితే, హీరోగా వెళితే అభిమానులు గోలగోల చేస్తారని భావించిన ఆ హీరో మారు వేషం వేశాడు. తలకు టోపీ, కళ్ళకు నల్లద్దాలు, మాసిగెడ్డంతో అచ్చం బాబాలా థియేటర్‌కు వచ్చి... సినిమాను హాయిగా చూసి వెళ్లాడు. ఇందుకు సంబంధించి ఓ ఫోటోను షేర్ చేసి ఈ విష‌యాన్ని వెల్లడించాడు రాజ్ త‌రుణ్. ఇప్పుడు ఆ విష‌యం తెలుసుకున్న అమ‌లాపురం ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు.
 
ఇటీవ‌ల "అంధ‌గాడు" సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రాజ్ త‌రుణ్ ప్రస్తుతం అమలాపురం పరిసరాల్లో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. దీంతో అమలాపురంలోని ఓ థియేటర్‌లో ఈ చిత్రాన్ని రాజ్ తరుణ్ వీక్షించాడు.