శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By IVR
Last Modified: మంగళవారం, 15 జులై 2014 (16:15 IST)

సెప్టెంబర్ 26న 'ముంబై 125 కి.మీ'

వీణా మాలిక్, కరణ్ వీర్ బోరా ముఖ్యతారలుగా 'వస్తాడు నా రాజు' ఫేం హేమంత్ మధుకర్  స్వీయదర్శకత్వంలో రూపొందుతోన్న భారీ 3 డి హారర్ చిత్రం 'ముంబై 125 కి.మీ'. సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి ఓ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్ 26న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ్ బాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా  డైరెక్టర్ హేమంత్ మధుకర్ మాట్లాడుతూ - ''ఆగస్ట్ లో ఈ చిత్రం ఆడియోను విడుదల చేయబోతున్నాం. ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం హైలైట్  అవుతుంది'' అని చెప్పారు. 
 
నిర్మాత మణిశర్మ మాట్లాడుతూ - ''భారతదేశంలో మొట్టమొదటిసారిగా రియల్ 3డీ మరియు డాల్బీ అత్మొస్ సౌండ్ సంయుక్త టెక్నాలజీతో ఈ చిత్రం తెరకెక్కుతోంది'' అని తెలిపారు.
 
వీణా మాలిక్, కరణ్ వీర్ బోరా, వెడిత ప్రతాప్ సింగ్, అపర్ణ బాజ్ సాయ్ తదితరులు  నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత - మణిశర్మ , హేమంత్ మధుకర్, స్టోరీ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - హేమంత్  మధుకర్