మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (09:26 IST)

అమెరికాలో అమ్మాయి.. స్కైప్ ద్వారా విడాకులిచ్చిన బాంబే హైకోర్టు

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ ప్రభావంతో మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ట్రిపుల్ తలాక్‌ నుంచి మహిళలకు విముక్తి లభించిన వేళ... పరస్పర అంగీకారంతో విడిపోతున్న ఓ ఎన్నారై జంటకు స్కైప్ ద్వారా విడాకులు ఇవ్

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ ప్రభావంతో మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ట్రిపుల్ తలాక్‌ నుంచి మహిళలకు విముక్తి లభించిన వేళ... పరస్పర అంగీకారంతో విడిపోతున్న ఓ ఎన్నారై జంటకు స్కైప్ ద్వారా విడాకులు ఇవ్వాలంటూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. 2002లో జలగాంలో పెళ్లి చేసుకున్న ఓ జంట 2016 నుంచి విడిపోయారు.
 
ఈ నేపథ్యంలో తమకు విడాకులు ఇవ్వాల్సిందిగా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కానీ మహిళ కోర్టుకు హాజరుకాకపోవడంతో విడాకుల కోసం వారు పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఉద్యోగ రీత్యా మహిళ అమెరికాలో ఉండడంతో ఆమె కోర్టుకు హాజరు కావడం వీలుకాలేదని ఆమె తరపు న్యాయవాది సమీర్ వైద్య చెప్పారు. ఇంకా పిటిషన్‌‍ను కోర్టు కొట్టివేయడంతో వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 
 
సాంకేతికత అభివృద్ధి చెందిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడాకులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం స్కైప్ ద్వారా విడాకులు ఇచ్చేందుకు అంగీకరించింది.