మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 నవంబరు 2020 (13:02 IST)

వరుడికి షాకిచ్చిన వధువు.. తాళికట్టే సమయంలో ప్రియుడు వస్తున్నాడని..?

Bride-Bridegroom
తాళికట్టే శుభవేళ ఓ వధువు వరుడికి షాకిచ్చింది. తమిళనాడు నీల్‌గిరీస్‌లోని మట్టకండి గ్రామంలో జరిగిన ఈ ఘటన పెళ్లిమండపంలోని అందరినీ అశ్చర్యానికి గురిచేసింది. నా ప్రియుడు నా కోసం వస్తున్నాడని, ఈ పెళ్లి నాకొద్దంటూ వరుడు తాళికట్టే సమయంలో పేర్కొన్న వధువు అందరినీ విస్మయానికి గురిచేసింది. కరోనా నిబంధనల దృష్ట్యా కొద్దిమంది బంధువుల సమక్షంలో ఇరువురి కుటుంబసభ్యులు అక్టోబర్‌ 29న ముహూర్తం పెట్టుకున్నారు. 
 
అయితే చివరి నిమిషంలో వధువు తనకు ఈ పెళ్లి వద్దంటూ కుటుంబ సభ్యులను, వరుడిని ఒప్పించే ప్రయత్నం చేసింది. తన ప్రియుడు వస్తున్నాడని చెప్పి పెళ్లి మండపం నుంచి లేచి వెళ్లిపోయింది. కూతురి ప్రేమను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు వధువును ప్రియుడికి అప్పగించారు. అదే మండపంలో వధువును ప్రియుడికిచ్చి వివాహం జరిపించారు.
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు నీలగిరి జిల్లా కోతగిరిలో నివాసముంటున్న ప్రియదర్శినికి నీలగిరి జిల్లాకే చెందిన ఓ వ్యక్తితో వివాహాన్ని నిశ్చయించారు ఇరువురి కుటుంబసభ్యులు. వివాహ వేడుకలో వరుడు తాళి కట్టే సమయంలో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను ప్రేమించిన వాడు అరగంటలో వస్తాడని చెప్పడంతో వరుడు ఖంగుతిన్నాడు. ఆమె ఏం చెబుతుందో అర్థం కాక చుట్టూ వున్న బంధువుల వైపు చూశాడు.
 
బంధువుల జోక్యం చేసుకుని సర్ది చెప్పబోతే వధువు ససేమిరా అంది. ఓ పెద్దావిడ మరికొంత జోక్యం చేసుకుని వధువుని నాలుగు దెబ్బలేసైనా ఒప్పిద్దామనుకుంటే.. వధువు ఆ పెద్దావిడకు ఎదురు తిరిగింది.
 
ఈ తంతు కొనసాగుతుండగానే ఎటూ తోచని వరుడు వివాహ వేడుక నుంచి వెళ్ళిపోయాడు. కుటుంసభ్యులు ఎంతగా వారించిన ప్రియదర్శిని మాట వినకపోవడంతో పెళ్లి వద్దంటూ వివాహ వేడుకనుండి వెళ్లిపోయాడు వరుడు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.