శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 23 జూన్ 2018 (12:11 IST)

ఒకే గదిలో అర్థగంట పాటు చంద్రబాబు - పవన్ కళ్యాణ్.. ఏం మాట్లాడుకున్నారు?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌ల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గున మండిపోతుంది. అలా నిప్పు-నీరుగా ఉన్న వీరిద్దరూ అర్థగంట పాటు ఒకే గదిలో ఉన్నారు. ఇదే ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌ల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గున మండిపోతుంది. అలా నిప్పు-నీరుగా ఉన్న వీరిద్దరూ అర్థగంట పాటు ఒకే గదిలో ఉన్నారు. ఇదే ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
 
శుక్రవారం విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై రెయిన్ ట్రీ పార్క్ సమీపంలోని లింగమనేని ఎస్టేట్స్‌లో దశావతార వేంకటేశ్వరస్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. కార్యక్రమం ముగిసిన అనంతరం చంద్రబాబు-పవన్‌లను గణపతి సచ్చిదానంద స్వామి దగ్గరికి పిలిచి ఓ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ వారు ముగ్గురూ పావుగంట పాటు సమావేశమై వివిధ అంశాల గురించి ప్రస్తావించుకున్నట్టు తెలుస్తోంది. 
 
అయితే, అక్కడ గణపతి సచ్చిదానంద స్వామి ఉన్నారు కాబట్టి రాజకీయాల గురించి వారు ప్రస్తావించి ఉండకపోవచ్చని అంటున్నారు. ఆధ్యాత్మిక అంశాలపై చంద్రబాబు-పవన్ చర్చించి ఉండొచ్చని చెబుతున్నారు. టీడీపీ వర్గాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి.
 
నిజానికి చంద్రబాబుతో విభేదించిన తర్వాత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, చంద్రబాబు సర్కారు అవినీతిని ఎంగడుతున్నారు. ఫలితంగా ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల అగ్ర నేతలు పావుగంటపాటు సమావేశం కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. వారిద్దరి మధ్య ఏం జరిగింది? ఏం మాట్లాడుకున్నారు? అన్నదానిపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.