మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : శనివారం, 31 మార్చి 2018 (12:09 IST)

''భరత్ అనే నేను'': మహేష్ కోసం పాటపాడిన బాలీవుడ్ హీరో.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ''భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు క్లైమాక్స్ దశకు చేరుకుంది. మరోవైపు ప్రమోషన్లు కూడా ప్రారంభమయ్యాయి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ''భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు క్లైమాక్స్ దశకు చేరుకుంది. మరోవైపు ప్రమోషన్లు కూడా ప్రారంభమయ్యాయి. 
 
ఇప్పటికే ఫస్ట్ లుక్‌లతో పాటు మొదటి పాటను విడుదల చేసిన చిత్ర యూనిట్. ఏప్రిల్ 1న మరో పాటను విడుదల చేయబోతోంది. ఈ పాటను ఎవరు పాడారో తెలుసా.. బాలీవుడ్ హీరో. ఐ డోన్డ్ నో అంటూ సాగే ఈ సాంగ్‌ను ఎవరు పాడారో సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ట్విట్టర్లో పెట్టారు.
 
ప్రముఖ బాలీవుడ్ హీరో, దర్శకుడు, గాయకుడు ఫర్హాన్ అక్తర్ ఈ పాటను ఆలపించారు. హిందీలో పలు పాటలను పాడిన ఫర్హాన్‌ మొదటి సారిగా దక్షిణాది భాషలలో ''భరత్‌ అనే నేను'' కోసం పాడారు. ఈ సందర్భంగా అతడికి సంబంధించిన వీడియోను కూడా దేవీశ్రీప్రసాద్ విడుదల చేశారు. 
 
ఆ వీడియోలో "ఫర్హాన్ అనే నేను, ఫస్ట్ టైమ్ తెలుగులో భరత్ అనే నేనుకు పాడాను. మీకు నచ్చుతుందని భావిస్తున్నా" అంటూ ఫర్హాన్ తెలిపాడు.  మరి ఈ పాటను వినాలంటే ఏప్రిల్ 1వరకు వేచి చూడాల్సింది. ఇక ఏప్రిల్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.