గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 2 అక్టోబరు 2018 (11:34 IST)

గాంధీజీ అంటే కదల్లేని విగ్రహం కాదు.. : రాహుల్ గాంధీ

మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద జాతిపితకు పలువురు నేతలు నివాళులు అర్పించారు. వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు

మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద జాతిపితకు పలువురు నేతలు నివాళులు అర్పించారు. వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.
 
ఆ తర్వాత ఆయన ఓ ట్వీట్ చేశారు. మహాత్మా గాంధీ అంటే కదల్లేని విగ్రహం కాదన్నారు. దేశమంతా విస్తరించిన విలువలు, జీవించి ఉన్న ఆలోచనలు అని ఆయన వ్యాఖ్యానించారు. సత్యం, అహింస కోసం జీవించిన గాంధీజీ దేశం కోసం ప్రాణాలర్పించారన్నారు. నిజమైన దేశ భక్తులు గాంధీజీ విలువలను కాపాడాలి అని పేర్కొంటూ రాహుల్‌ ఓ ట్వీట్‌ చేశారు.