శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 11 ఏప్రియల్ 2018 (14:37 IST)

యువతిపై రేప్ .. నా భర్తకు నార్కో పరీక్షలు నిర్వహించాలి : బీజేపీ ఎమ్మెల్యే భార్య

యువతిపై అత్యాచారం చేసిన కేసులో తన భర్తతో పాటు.. బాధిత యువతికి కూడా నార్కో పరీక్షలు నిర్వహించాలంటూ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే భార్య డిమాండ్ చేసింది.

యువతిపై అత్యాచారం చేసిన కేసులో తన భర్తతో పాటు.. బాధిత యువతికి కూడా నార్కో పరీక్షలు నిర్వహించాలంటూ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే భార్య డిమాండ్ చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన భార్య సంగీత సెంగార్ బుధవారం యూపీ డీజీపీ ఓపీ సింగ్‌ను కలుసుకున్నారు. ఉన్నావ్‌కి చెందిన అత్యాచార బాధితురాలికి, తన భర్తకు నార్కో పరీక్షలు నిర్వహించాలంటూ వినతిపత్రం సమర్పించారు. అత్యాచారం ఆరోపణల్లో వాస్తవం లేదనీ... తన భర్తకు న్యాయం చేయాలంటూ ఆమె అభ్యర్థించారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, 'నా కుమార్తెలను భయాందోళనకు గురిచేశారు. మమ్ముల్ని మానసికంగా వేధిస్తున్నారు. ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు రుజువు కాకుండానే నా భర్త (కుల్దీప్ సెంగార్)పై మీడియా రేపిస్టు అంటూ ముద్ర వేసేసింది' అని ఆమె పేర్కొన్నారు. తన భర్తపై వస్తున్న ఆరోపణలన్నీ 'నిరాధారమైనవనీ', 'కట్టుకథలేనని' కుల్దీప్ భార్య పేర్కొన్నారు. అంతేకాకుండా భర్త తమ్ముడుగానీ, అతడి అనుచరులుగానీ బాధితురాలి తండ్రిపై దాడిచేయలేదనీ... పోలీసులే ఆయనపై దాడిచేశారని ఆమె ఆరోపించారు.