మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వినాయక చవితి
Written By ivr
Last Modified: గురువారం, 28 ఆగస్టు 2014 (13:49 IST)

ఖైరతాబాద్ శ్రీకైలాస విశ్వరూప మహాగణపతికి 5 టన్నుల లడ్డు

రేపు వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ శ్రీకైలాస విశ్వరూప మహాగణపతికి 5 టన్నుల లడ్డును తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి పంపేందుకు పంపుతున్నారు. 5,000 కిలోలు బరువున్న ఈ తాపేశ్వరం లడ్డును రూ. 15 లక్షల వ్యయంతో తయారు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ లడ్డును గవర్నర్ చేతులు మీదుగా గణేశునికి సమర్పించనున్నట్లు తెలియజేశారు.
 
ఏటేటా తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ ఈ ప్రసాదాన్ని సమర్పిస్తుంది. 2010లో 500 కిలోల లడ్డూతో ప్రారంభమైన ఈ ప్రసాద పంపిణీ ఈ ఏడాది 5000 కిలోలకు చేరిందని సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు తెలియజేశారు.
 
60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఖైరతాబాద్ గణపతిని ఈ ఏడాది శ్రీకైలాస విశ్వరూప మహాగణపతిగా నామకరణం చేశారనీ, తాము ఈ నెల 21న తనతోపాటు 16 మంది గణేష్ మాల ధరించి మహాలడ్డూ తయారీ పనులు ప్రారంభించి పూర్తి చేసినట్లు వెల్లడించారు. లడ్డూను భారీ ట్రాలీపై ఊరేగింపుతో ప్రత్యేక వాహనంలో ఖైరతాబాద్ తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.