కొత్త పార్టీ పెడితే మాతో పెట్టుకో: జగన్కు వెంకయ్య సూచన!
కాంగ్రెస్ రెబెల్ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డితో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డిలు ఫోనులో మాట్లాడారు. జగన్ పెట్టే కొత్త పార్టీని తాము స్వాగతిస్తున్నట్టు ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అదేసమయంలో కొత్త పార్టీ తమతో పొత్తు పెట్టుకోవాలని జగన్కు వెంకయ్య సూచించినట్టు సమాచారం. కర్ణాటక మంత్రులు గాలి సోదరుల సూచన మేరకే వెంకయ్య ఫోన్ చేసినట్టు సమాచారం. జగన్ పెట్టే కొత్త పార్టీకి తెలంగాణ ప్రాంతంలో నిలబడాలంటే మంచి పట్టున్న భారతీయ జనతా పార్టీ లేదా మరొక పార్టీతో పొత్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లో ఇలాంటి అవసరం జగన్కు లేదు. ఈ విషయాన్ని గ్రహించిన భాజపా నేతలు జగన్తో ఇప్పటి నుంచి టచ్లో ఉంటూ వస్తున్నారు.