శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Modified: గురువారం, 11 ఏప్రియల్ 2019 (14:40 IST)

నిజమే... 372 ఈవీఎంలు పనిచేయడంలేదు... కడపలో ఓటర్లు ఏరీ?

అటు తెదేపా చీఫ్ చంద్రబాబు ఇటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇద్దరూ ఈవీఎంలు మొరాయించడాన్ని, కొన్ని మిషన్ల పనితీరుపై అనుమానం వ్యక్తం చేసిన నేపధ్యంలో ఈసీ ద్వివేదీ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా 372 ఈవీఎంలు కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయాయని తెలిపారు. వాటిని సరిచేసేందుకు ఇంజినీర్లు పనిచేస్తున్నారని వెల్లడించారు. ఐతే 157 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని తెదేపా డిమాండ్ చేస్తోంది.
 
ఇదిలావుంటే ఏపీలో ఇప్పటివరకూ జరిగిన పోలింగ్ శాతాన్ని చూస్తే... కడప, గుంటూరు జిల్లాల్లో అత్యల్పంగా 32 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక మిగిలిన జిల్లాలు చూస్తే.. శ్రీకాకుళం 35 శాతం, విజయనగరం 37, విశాఖ 35, తూ.గో 36, కృష్ణా జిల్లా 38, ప్రకాశం 37, నెల్లూరు 37, కర్నూలు 35, అనంతపురం 37, చిత్తూరు 33 శాతం ఓట్లు పోలయ్యాయి.