మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : శనివారం, 30 మార్చి 2019 (16:30 IST)

ప్రచారంలో దురుసు ప్రవర్తన : నన్నే ప్రశ్నిస్తావా? కార్యకర్తను తోసేసిన బాలయ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం మహా ఉధృతంగా సాగుతోంది. కొన్నిచోటు అపశృతులు చోటుచేసుకున్నాయి. మరికొన్న చోట్ల పోటీలో ఉన్న అభ్యర్థులు తమను నిలదీస్తున్న ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన కోపాన్ని చూపారు. 
 
ఇటివలే అనంతపురం జిల్లా హిందుపురంలో ఎన్నికల ప్రచారంలో మీడియా ప్రతినిధి పట్ల బాలయ్య దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. తాజాగా తమ సొంత టీడీపీ పార్టీ కార్యకర్తపైనే చిందులు తొక్కారు. తన ఎన్నిల ప్రచారంలో భాగంగా హిందూపురం సమీపంలోని సిరివరం గ్రామానికి బాలయ్య వెళ్లారు. 
 
అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రవికుమార్‌ తమ గ్రామ చెరువుకు నీరు విడుదల చేయాలని బాలయ్యను కోరారు. ఇక దీంతో నన్నే ప్రశ్నిస్తావా అని అనుకున్నాడో ఏమో ఆగ్రహానికి గురైన బాలయ్య ఆ కార్యకర్తని తోసేశారు. 
 
వెంటనే ఆ కార్యకర్తను బయటకు పంపండి అని ఆదేశించడంతో పోలీసులు అక్కడి నుండి పంపేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రవికుమార్‌ టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వెంటనే సమీప గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ అభ్యర్థి ఇక్బాల్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాలయ్య తీరును ఆయన ఎండగట్టారు.