శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Modified: శనివారం, 13 ఏప్రియల్ 2019 (21:55 IST)

గాజువాకలో పవన్ కల్యాణ్... నాకు భారతరత్న ఇచ్చి మభ్యపెట్టాలని చూసారు: కె.ఎ పాల్

ప్రజాశాంతి పార్టీ అధినేత కె.ఎ పాల్ చేస్తున్న వ్యాఖ్యలు చూసిన కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు పకాపకా నవ్వుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారనేది వారికే తెలియాలి అంటున్నారు కె.ఎ పాల్ మద్దతుదారులు. ఇక అసలు విషయానికి వస్తే... మొన్నామధ్య జగన్ మోహన్ రెడ్డి సోదరి సింహం సింగిల్ వస్తుంది అని చెప్పింది తన గురించేననీ, నేను ఎక్కడికెళ్లినా సింగిల్‌గానే వెళ్లినట్లు చెప్పారు. 
 
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 60 శాతం పైచిలుకు స్థానాలను తాము దక్కించుకోబోతున్నట్లు చెప్పుకొచ్చారు. తనకు భారతరత్న, నోబెల్ పురస్కారానికి భారత ప్రధాని మోదీ ప్రతిపాదించారనీ, అలా తనను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. అయితే అవన్నీ తను పసిగట్టినట్లు వెల్లడించారు. గాజువాకలో పవన్ కల్యాణ్ గెలిచే అవకాశం వున్నదనీ, అది కూడా తెదేపా మద్దతుతో పవన్ గెలిచే అవకాశం దాదాపు ఖాయం అని చెప్పారు పాల్.