మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 15 మే 2019 (13:21 IST)

టెన్త్ పాసైన ఆనందంలో కూల్‌డ్రింక్స్ కోసం వెళ్తే టాటా ఏస్ కాటేసింది...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణతా శాతం నమోదైంది. ఇలా పాసైన వారిలో రుక్మిణి అనే బాలిక రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. టెన్త్ పాసయ్యానన్న ఆనందంలో కూల్‌డ్రింక్స్ తెచ్చి తన స్నేహితులకు ఇవ్వాలని రోడ్డుపైకి పరుగెత్తుకుంటూ వెళ్లింది. ఆ సమయంలో వేగంగా వచ్చిన టాటా ఏస్ కంపెనీ ఆ బాలికను ఢీకొట్టింది. దీంతో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ ప్రమాదం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సమీపంలోని కలవచర్ల గ్రామంలో జరిగింది. పదో తరగతి ఫలితాలు రాగానే, ఆనందంతో తన చెల్లెలితో కలిసి తిరుగుపల్లి రుక్మిణి (15) రోడ్డు పక్కన ఉండే ఓ దుకాణానికి శీతలపానీయం కోసం వెళ్లింది. ఆ సమయంలో వేగంగా వచ్చిన టాటా ఏస్ - మ్యాజిక్ అక్కాచెల్లెళ్లను ఢీక్కొట్టింది. 
 
ఈ ఘటనలో రుక్మిణి అక్కడికక్కడే ప్రాణాలు వదలగా, ఆమె చెల్లికి గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. రుక్మిణి సోదరిని చికిత్స నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు టాటా ఏస్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.