శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (11:54 IST)

పోకిరీగాళ్లా.. లా కాలేజీ విద్యార్థులా.. ఏడేళ్ల చిన్నారిపై కత్తితో..?

తమిళనాడు రాజధాని చెన్నైలో ఏడేళ్ల చిన్నారిపై దారుణం చోటుచేసుకుంది. చెన్నైలో ఏడేళ్ల చిన్నారిని ఇద్దరు లా కాలేజీ విద్యార్థులు కత్తితో నరికారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై, తండయార్ పేటకు చెందిన కార్తీక్‌కు ఓ కుమారుడు, ఓ కుమార్తె వుంది. 
 
కార్తీక్ ఏడేళ్ల కుమారుడు చంద్రు తన మేనమామతో రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా.. ఆ సమయంలో అతని వెనుక నుంచి ఇద్దరు యువకులు చేతిలో కత్తిని పెట్టుకుని తిప్పుతూ వచ్చారు. ఆ సమయంలో ఏదో శబ్ధం వినిపిస్తుందని చంద్రు తిరిగి చూశాడు. అంతే ఆ కత్తి చంద్రుపై పడింది. కత్తిని తిప్పుతూ వేగంగా బైకుపై రావడంతో బాలుడు భుజానికి, కంటికి గాయం ఏర్పడింది. 
 
దీంతో తీవ్ర రక్తస్రావంతో బాలుడిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా యువకులను అరెస్ట్ చేశారు. వారిద్దరూ లా కాలేదీ విద్యార్థులని.. తాగి పోకిరీగాళ్లుగా బండ్లపై తిరుగుతూ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పారు.