శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 12 నవంబరు 2018 (16:35 IST)

ఆమెతో గడిపేందుకు చెన్నై నుంచి వెళ్లిన ప్రియుడు.. మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు

ఒడిషా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మర్మాంగాన్ని ప్రియురాలు కోసేసిందు. ఆమెతో గడిపేందుకు చెన్నై నుంచి ఒడిషాకు వెళ్లినందుకు తగినశాస్తి జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఒడిశా రాష్ట్రంలోని కియోంజర్ జిల్లాలో బదువాగాన్ గ్రామంలో చెందిన రాజేంద్ర నాయక్ (25) అనే వ్యక్తి చెన్నైలో పని చేస్తున్నాడు. కానీ, ఆయనకు భువనేశ్వర్‌లో తన పక్కింటిలో నివశించే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. గత కొన్ని నెలలుగా ఈమెతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చిన రాజేంద్ర నాయక్.. ఇటీవల ఆమెతో పడక సుఖం కోసం చెన్నై నుంచి గ్రామానికి వెళ్లాడు. 
 
తొలుత తన ఇంటికి చేరుకున్న రాజేంద్ర నాయక్.. తన ప్రియురాలి కోసం ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇరువరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం అతడు ఆమె ఇంట్లోనే నిద్రించాడు. నిద్రలో ఉన్న నాయక్‌పై దాడి చేసిన ఆ మహిళ కత్తితో అతడి మర్మాంగాన్ని కత్తిరించింది. దాంతో బాధితుడు పెద్దగా కేకలు పెట్టడంతో పొరుగువారు వచ్చి అతన్ని ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.