1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 30 జూన్ 2018 (18:59 IST)

కుమార్తె ఫోన్ మాట్లాడుతోందని గొడ్డలి కర్రతో ఒకే ఒక్క దెబ్బతో చంపేశాడు...

అనుమానం పెనుభూతం అంటుంటారు పెద్దలు. నిజమే. అలాంటి అనుమానంతో కన్నకుమార్తెనే దారుణంగా హతమర్చాడు ఓ తండ్రి. తన కుమార్తె ఫోనులో తరచూ మాట్లాడుతూ వుండటాన్ని గమనిస్తూ వచ్చిన ఆ తండ్రి ఆమెను మెల్లిగా తన దారిలోకి తెచ్చుకోవాల్సింది పోయి ఆమెను పర లోకానికే పంపేశాడ

అనుమానం పెనుభూతం అంటుంటారు పెద్దలు. నిజమే. అలాంటి అనుమానంతో కన్నకుమార్తెనే దారుణంగా హతమర్చాడు ఓ తండ్రి. తన కుమార్తె ఫోనులో తరచూ మాట్లాడుతూ వుండటాన్ని గమనిస్తూ వచ్చిన ఆ తండ్రి ఆమెను మెల్లిగా తన దారిలోకి తెచ్చుకోవాల్సింది పోయి ఆమెను పర లోకానికే పంపేశాడు. ఈ దారుణ ఘటన వివరాలు ఇలా వున్నాయి.
 
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడులో కోటయ్య కుటుంబం నివాసముంటోంది. ఆయనకు కాలేజీ చదివే కుమార్తె వుంది. ఐతే ఇటీవలి నుంచి ఆమె తరచూ ఫోనులో మాట్లాడటం ఎక్కువగా చేస్తూ వుంది. దీనిపై తండ్రి కోటయ్య అనుమానం పెంచుకున్నాడు. కుమార్తె ప్రవర్తన తప్పుదారి పడుతుందని ఆగ్రహంతో ఊగిపోయాడు. పక్కనే వున్న గొడ్డల కర్రతో ఒకే ఒక్క దెబ్బను ఆమె తలపై వేశాడు. కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.