బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 18 జూన్ 2018 (21:18 IST)

స్కూల్లో ఇద్దరు టీచర్లను ఆ భంగిమలో చూసిన విద్యార్థి... ఆ తరువాత...

విద్యాబుద్థులు నేర్పించాల్సిన ఇద్దరు టీచర్లు శృంగారంలో ముగినితేలారు. అది కూడా వందలాదిమంది విద్యార్థులు ఉండే స్కూల్లోనే. నెల రోజుల పాటు అక్రమ సంబంధం కొనసాగించి చివరకు ఒక విద్యార్థికి అడ్డంగా దొరికిపోయారు.

విద్యాబుద్థులు నేర్పించాల్సిన ఇద్దరు టీచర్లు శృంగారంలో ముగినితేలారు. అది కూడా వందలాదిమంది విద్యార్థులు ఉండే స్కూల్లోనే. నెల రోజుల పాటు అక్రమ సంబంధం కొనసాగించి చివరకు ఒక విద్యార్థికి అడ్డంగా దొరికిపోయారు.  
 
నెల్లూరు జిల్లా కావలిలోని ఒక ప్రైవేటు స్కూల్లో మహేష్, జ్యోతిలు నెల రోజుల పాటు వివాహేతర సంబంధం కొనసాగించారు. తమ కళాశాల తరగతి గదుల్లోనే శృంగారంలో మునిగితేలేవారు. మధ్యాహ్నం సమయంలో విద్యార్థులు భోజన విరామ సమయానికి వెళ్ళినప్పుడు తలుపులు మూసుకుని అక్రమ సంబంధాన్ని కొనసాగించేవారు. వీరిపై అనుమానం వచ్చిన సాయిక్రిష్ణ అనే విద్యార్థి ఒకరోజు తరగతి గదిలోనే బల్లకింద దాక్కున్నాడు.
 
అయితే సాయిక్రిష్ణను గుర్తించని వీరిద్దరు శృంగారంలో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో సాయిక్రిష్ణ బల్ల కింద నుంచి బయటకు వచ్చాడు. దీంతో ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాలేదు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని జ్యోతి భయపడింది. మహేష్‌ను ఏదో ఒకటి చేయమని కోరింది. దీంతో విద్యార్థి సాయిక్రిష్ణను మహేష్ తన గదిలోకి తీసుకెళ్ళాడు. సాయిక్రిష్ణను భయపెట్టే ప్రయత్నం చేశాడు. 
 
కానీ సాయిక్రిష్ణ ఉపాధ్యాయుడి బెదిరింపులకు భయపడలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన మహేష్ విద్యార్థి చెంపను చెళ్లుమనిపించాడు. ఒక్కసారిగా సాయిక్రిష్ణ పక్కనే ఉన్న టేబుల్ పైన పడిపోయాడు. తల టేబుల్‌కు గట్టిగా కొట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయాడు. విషయం బంధువులకు తెలియడంతో వారు పాఠశాలపై దాడి చేశారు. మహేష్, జ్యోతిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.