శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 24 మార్చి 2018 (17:38 IST)

అమిత్ షా అబద్ధాలకోరు... 9 పేజీల్లోనూ అబద్ధాలే... చంద్రబాబు ధ్వజం

భాజపా అధ్యక్షుడు అమిత్ షా తాజాగా లెక్కలు చూపిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాసిన లేఖపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అమిత్ షా అన్ని లెక్కలు చూపిస్తూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నెన్ని నిధులు ఇచ్చినదీ, వెల్

భాజపా అధ్యక్షుడు అమిత్ షా తాజాగా లెక్కలు చూపిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాసిన లేఖపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అమిత్ షా అన్ని లెక్కలు చూపిస్తూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నెన్ని నిధులు ఇచ్చినదీ, వెల్లడించారు. ఐతే అమిత్ షా 9 పేజీల లేఖలో ప్రస్తావించిన గణాంకాలన్నీ అబద్ధాలేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. 
 
అసెంబ్లీ సమావేశాల్లో బాబు మాట్లాడుతూ... కొన్ని అంశాల‌ను వ‌క్రీక‌రిస్తూ లేఖ‌లో పేర్కొన్నార‌నీ, ఇలా అస‌త్యాలు ఎందుకు చెబుతున్నార‌ని, ఉన్న‌త స్థాయిలో ఉన్న వ్య‌క్తులకు ఇలాంటి తీరులో ప్రవర్తించడం ఆశ్చర్యకరంగా వుందన్నారు. అమిత్ షా రాసిన లెక్కలకీ కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధులకు పొంతనే లేదన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ రాష్ట్రం వద్ద వుంటాయని తెలిసి కూడా ఇలాంటి అవాస్తవాలను లేఖలో ఎందుకు రాశారని ప్రశ్నించారు.
 
హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ అయితే ఆ పార్టీకి మద్దతునిచ్చింది భాజపా అన్నారు. అలాంటప్పుడు రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత భాజపా పైన లేదా అని నిలదీశారు. రాష్ట్రానికి న్యాయం చేస్తారేమోనని చివరి వరకూ వేచి చూసామనీ, ఐతే కేంద్రం మొండి చెయ్యి చూపించడంతో ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.