శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 24 మార్చి 2018 (14:13 IST)

అమరావతికి వెయ్యి కోట్లిచ్చాం.. తప్పంతా చంద్రబాబుదే: అమిత్ షా ఆశ్చర్యం

రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎన్డీయే విఫలమైందంటూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇంకా ఎన్డీయే నుంచి టీడీపీ తప్పకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీ

రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎన్డీయే విఫలమైందంటూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇంకా ఎన్డీయే నుంచి టీడీపీ తప్పకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఎ నుంచి వైదొలగడంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఏపీ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 
 
ఎన్డీఎ నుంచి వైదొలగాలని చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. తప్పంతా బాబుదేనని. ఏపీకి ఎంతో చేశామని లేఖలో చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కన్నా చంద్రబాబు రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోందని అమిత్ షా చెప్పారు. ఏపీ అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారని చెప్పారు. ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేశారని తెలిపారు. మూడు ఎయిర్ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మార్చామన్నారు. 
 
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం వెయ్యి కోట్లు ఇచ్చిందని.. కానీ రాష్ట్రం కేవలం 12 శాతం మాత్రమే అమరావతి కోసం ఖర్చు చేసిందని అమిత్ షా ఆరోపించారు. ఇలా 12 శాతం ఖర్చుచేసి, 8 శాతానికి మాత్రమే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించిందని అమిత్ షా తెలిపారు. అమిత్ షా రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.