శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 2 డిశెంబరు 2020 (16:55 IST)

చిన్ననాటి స్నేహితుడితో వివాహేతర సంబంధం, భార్యకు ఎయిడ్స్ వచ్చిందనీ...

ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. సాఫీగా సాగిపోతున్న జీవితం. అయితే భార్య చిన్ననాటి స్నేహితుడితో శారీరక సంబంధం పెట్టుకుని తన జీవితాన్ని నిలువుగా నాశనం చేసుకుంది. అభంశుభం తెలియని చిన్నారులు ఇప్పుడు అనాధల్లా మిగిలిపోయారు. 
 
కర్ణాటక రాష్ట్రం హవేరిజిల్లా రణబెన్నూర్ ప్రాంతానికి చెందిన నవీన్‌కి లతతో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి స్వస్థలం అనంతపురంజిల్లా పుట్టపర్తి. ఉపాధి లేక బెంగుళూరుకు వలస వెళ్ళారు. వీరికి ప్రస్తుతం ఏడు సంవత్సరాల కొడుకు, ఆరు సంవత్సరాల కూతురు ఉన్నాఉ. 
 
నవీన్ సెల్ ఫోన్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. లత ఇంటి దగ్గరే ఉంటోంది. అయితే గత రెండు నెలల నుంచి అనంతపురం జిల్లా నుంచి వచ్చిన లత చిన్ననాటి స్నేహితుడు రాజేష్‌తో ఆమె ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది. లత ఇంటికి సమీపంలోనే రాజేష్ ఉండేవాడు. ఉద్యోగం కోసం బెంగుళూరుకు వచ్చాడు.
 
లతకు మాయమాటలు చెప్పి చివరకు రాజేష్ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. భార్యలో మార్పు రావడంతో అనుమానం వచ్చిన నవీన్ ఆమెకు హెచ్ఐవి టెస్ట్ చేయించాడు. దీంతో ఆమెకు పాజిటివ్ అని వచ్చింది. కోపంతో రగిలిపోయిన నవీన్ నిన్న రాత్రి నిద్రిస్తున్న లతను అతి దారుణంగా నరికి చంపేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. తల్లి చనిపోయి, తండ్రి పరారీలో ఉండడంతో పిల్లలు అనాధలుగా మిగిలారు.