శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (16:43 IST)

యువకుడి పాడుపని.. నిద్రిస్తున్న వృద్ధురాలిపై అత్యాచారం..

68 యేళ్ల వృద్ధురాలిపై 20 యేళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అదీకూడా కామంతో కళ్లుమూసుకుని పోయిన ఆ యేళ్ల 20 యేళ్ల యువకుడు.. గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ దారుణానికి తెగబడ్డాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో

68 యేళ్ల వృద్ధురాలిపై 20 యేళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అదీకూడా కామంతో కళ్లుమూసుకుని పోయిన ఆ యేళ్ల 20 యేళ్ల యువకుడు.. గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ దారుణానికి తెగబడ్డాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగిన ఈ ఘటన జరిగింది.


వివరాల్లోకి వెళితే...  ఉయ్యూరు రూరల్‌ ప్రాంతంలో ఒంటరిగా నివసించే వృద్ధురాలు నిద్రిస్తున్న సమయంలో ఇంటిలోకి అదే గ్రామానికి చెందిన కొడాలి సతీష్‌ అనే యువకుడు చొరబడి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
ఈ యువకుడు పాడుపనికి ఆ వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకున్నారు. దీంతో సతీష్ కాళ్లకు పని చెప్పాడు. అయితే, వృద్ధురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. 
 
వృద్ధురాలిని వైద్యపరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన యువకుడు తప్పతాగి వున్నాడని పోలీసులు వెల్లడించారు. అతనిపై 376 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని చెప్పారు.