1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (08:45 IST)

ఎక్సైజ్ ఠాణాలో కీచకపర్వం... నిందితుడి భార్యపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం

ఖమ్మం జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కీచకపర్వం జరిగింది. నిందితుడి భార్యపై ఓ కానిస్టేబుల్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అదీకూడా పీకల వరకు మద్యం సేవించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ

ఖమ్మం జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కీచకపర్వం జరిగింది. నిందితుడి భార్యపై ఓ కానిస్టేబుల్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అదీకూడా పీకల వరకు మద్యం సేవించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఖమ్మంలోని రంగనాయకగుట్టకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ బెల్ట్‌ దుకాణాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అతడి బెల్ట్‌షాపుపై ఎక్సైజ్‌ పోలీసుల దాడి చేసి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్‌ను ఎక్సైజ్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 
 
ఈ క్రమంలో ఆ ఆటోడ్రైవర్‌కు తోడుగా అతడి భార్య కూడా స్టేషన్‌కు వెళ్లింది. ఆదేసమయంలో ఎక్సైజ్‌ కార్యాలయంలోనే కానిస్టేబుల్‌ నరేందర్‌తో పాటు మరో ఇద్దరు మద్యం తాగుతూ కనిపించారు. 
 
అపుడు మద్యం మత్తులో ఆటో డ్రైవర్ భార్యపై నరేందర్‌తో పాటు.. మిగిలిన ఇద్దరూ దురుసుగా ప్రవర్తించి, అత్యాచారయత్నం చేశాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు నరేందర్‌ను సస్పెండ్‌ చేశారు.