శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (14:39 IST)

గర్భందాల్చాను ఏం చేద్దామన్న బాలిక.. ద్వారకా తిరుమల తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న టీచర్...

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో పాఠాలు బోధించే కీచక మాస్టర్ పాలిటెక్నిక్ చదివే విద్యార్థినిని గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ఆ యువతిని ద్వారకా తిరుమల తీసుకెళ్లి మెడలో మూడు ముళ్ల

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో పాఠాలు బోధించే కీచక మాస్టర్ పాలిటెక్నిక్ చదివే విద్యార్థినిని గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ఆ యువతిని ద్వారకా తిరుమల తీసుకెళ్లి మెడలో మూడు ముళ్లు వేసి ఇంటికి తీసుకొచ్చాడు. అయితే, ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ టీచర్‌ను బాలిక బంధువులు పట్టుకుని చితక్కొట్టిన విషయం తెల్సిందే. ఆ తర్వాత పోలీసులకు పట్టించారు.
 
కర్నూలుకు చెందిన కారె రాంబాబు ఆరేళ్ళుగా ఏలూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీషు, సైన్సు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఆ పాఠశాలలో పదో తరగతి చదివిన ఓ బాలిక.. ప్రస్తుతం పాలిటెక్నిక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. రెండేళ్ల నుంచి ఆమెకు మాయమాటలు చెప్పి తన గదికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. 
 
ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. బాధిత విద్యార్థిని రాంబాబును నిలదీయడంతో ద్వారకాతిరుమల తీసుకెళ్లి ఈనెల 18వ తేదీన పెళ్ళి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి ఈనెల 21వ తేదీ రాత్రి ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు రాంబాబుపై దాడి చేసి కొట్టిన ఘటన సంచలనమైన విషయం తెల్సిందే. దీనిపై ఏలూరు పోలీసులు కేసు నమోదు చేసి రాంబాబును అరెస్టు చేశారు.