1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (14:21 IST)

ఏపీ గవర్నర్ హరిచందన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

సంతోషకరమైన ‘శ్రీ రామ నవమి’ పండుగ శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక  శుభాకాంక్షలు తెలియ జేస్తున్నట్టు ఏపీ గవర్నర్ హరిచందన్ అన్నారు. ఇదే విషయంపై ఆయన మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
శ్రీరాముడు ధర్మం, ప్రేమ, సత్య జీవితాన్ని గడపడానికి మనకు మార్గనిర్దేశం చేయాలని ప్రార్థిస్తున్నాను. శ్రీరామ నవమి పండుగను కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉండి జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నందున, అప్రమత్తంగా ఉండాలి. 
 
సామాజిక దూరాన్ని పాటించటం, ముఖ ముసుగు ధరించడం, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవటం వంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అర్హులైన వారందరూ సమీప కోవిడ్ టీకా కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 
 
కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితం, వైరస్ యొక్క గొలుసును విచ్ఛిన్నం చేయడానికి వ్యాక్సిన్ తీసుకోవటం ఏకైక మార్గం." ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.