శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Modified: మంగళవారం, 7 ఆగస్టు 2018 (14:02 IST)

ఏపీ సచివాలయంలో ఎడ్లబండి... చూస్తారా?

బండి నిండుగా ధాన్యం బస్తాలు.. దానిపై ఓ రైతు కుటుంబం.. బండికి ముందు వెళుతున్న రైతు. బండి తొట్టిలో కూర్చుని ఎడ్లును తోలుతున్న ఓ కుర్రాడు చూడటానికి ఎంత బాగుంటుందో కదా. అప్పుడెప్పుడో మన పల్లెల్లో ఈ దృశ్యాలు చూసేవాళ్లం. కానీ నేడు ట్రాక్టర్లు ఆధునిక యంత్రా

బండి నిండుగా ధాన్యం బస్తాలు.. దానిపై ఓ రైతు కుటుంబం.. బండికి ముందు వెళుతున్న రైతు. బండి తొట్టిలో కూర్చుని ఎడ్లును తోలుతున్న ఓ కుర్రాడు చూడటానికి ఎంత బాగుంటుందో కదా. అప్పుడెప్పుడో మన పల్లెల్లో ఈ దృశ్యాలు చూసేవాళ్లం. కానీ నేడు ట్రాక్టర్లు ఆధునిక యంత్రాలు పుణ్యమా అని మచ్చుకైనా ఇటువంటివి కనిపిస్తున్నాయా అనే సందేహం మనకు రాక మానదు.
 
కానీ ఏపీ సచివాలయయంలో ఈ సీన్ రెగ్యులర్‌గా కనిపిస్తోంది. ఎడ్ల బండిని, దానిపై రైతు కుటుంబాన్ని దూరం నుంచి చూసి.. రైతు బండితో సహా ఇక్కడికి వచ్చేశాడేమిటి? అని ఆశ్చర్యపోతున్నారు సందర్శకులు. కాస్త దగ్గరకు వెళ్లాక అది బొమ్మ అని తెలిసి ఔరా అంటున్నారు. సచివాలయానికి వచ్చిన వారికి పార్కులో ఏర్పాటు చేసిన ఈ ఎడ్లబండి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అధికారులు ఏర్పాటు చేసిన ఎడ్లబండిపై పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.