శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 5 జూన్ 2019 (18:40 IST)

హల్లో నాని... నేను, ఏంటి పార్టీ మారుతున్నావట.. నానికి చంద్రబాబు ఫోను

తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన ఢిల్లీలోని బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్టు జోరుగా కథనాలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేశినేని నానితో టీడీపీకి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా విజయవాడలో సమావేశమై మంతనాలు జరిపారు. ఆ తర్వాత నాని పార్టీ మారడం లేదంటూ మీడియాకు వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో కేశినేని నానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్ చేసి.. తన నివాసానికి రావలసిందిగా కోరినట్టు తెలుస్తోంది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతల నియామక విషయంలో ఇటీవల జరిగిన పరిణామాలు నానికి మనస్తాపం కలిగించాయన్నది లోగుట్టు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయనను పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
మరోవైపు, నాని బీజేపీలో చేరవచ్చంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి బలం చేకూర్చేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని నాని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో నాని పార్టీ మారడం ఖాయమంటున్నారు. ఇపుడు నానికి చంద్రబాబు ఫోన్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. 
 
మొత్తంమీద కేశినేని నాని అంశం ఇపుడు టీడీపీలో కలకలం రేపుతోంది. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 25 ఎంపీ సీట్లకుగాను కేవలం మూడు ఎంపీలు గెలిచారు. వారిలో ఒకరు కేశినేని నాని. విజయవాడ లోక్‌సభ స్థానం.