ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 8 జనవరి 2019 (10:52 IST)

చంద్రబాబుకు హరికృష్ణ కుమార్తె సుహాసిని వెన్నుపోటు? ఎలా?

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని తేరుకోలేని షాకివ్వనుంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి సుహాసిని పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి చేతిలో ఆమె ఓడిపోయింది. 
 
అయితే, తమను ఓడించేందుకు బద్ధశత్రువైన కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు నాయుడు చేతులు కలపడాన్ని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. దీనికి ప్రతిఫలంగా రిటర్న్ గిఫ్టు ఇస్తానంటూ కేసీఆర్ మీడియా ముఖంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుహాసినిని తెరాస పార్టీలోకి ఆహ్వానించాలని ఆయన భావిస్తున్నారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిను సుహాసినిని తెరాసలో చేర్చుకుని ఆమెకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఈ అంశం తెరాస శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. అలాగే, గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నేతలతో పాటు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఒకింత షాక్‍‌కు గురై... ఇది నిజమా కాదా అనేదానిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.