మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 మే 2020 (12:02 IST)

ఏటీఎం కార్డు వివరాలు ఇవ్వలేదనీ... మహిళపై అత్యాచారం

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఓ దొంగ అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి కారణం.. బాధిత మహిళ ఏటీఎం కార్డు వివరాలు ఇవ్వకపోవడమే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీకి చెందిన ఓ మహిళ తమ ఇంటి బాల్కనీలో కూర్చొని మొబైల్ వాడుతోంది. అదేసమయంలో ఓ 23 యేళ్ల కుర్రాడు దొంగతనం చేయడానికి ఆ ఇంటిలో చొరబడ్డాడు. ఈ విషయం గ్రహించిన ఆ మహిళ.. ఆ దొంగను అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది. 
 
ఆ దొంగ కత్తితో చంపుతానని బెదిరించడంతో మహిళ మిన్నకుండిపోయింది. ఆ తర్వాత ఇంట్లోని విలువైన వస్తువులు, డబ్బు తనకు అప్పగించాలని ఆమెను బెదిరించాడు. ఆపై ఆమె బ్యాంకు ఏటీయం కార్డులు తీసుకొని వాటి పిన్ నంబర్ చెప్పాలని ఒత్తిడి చేశాడు. 
 
అందుకు ఆ మహిళ నిరాకరించింది. అంతే.. ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను పారిపోయిన తర్వాత పోలీసులకు సమాచారం అందించిన ఆమె.. సదరు దొంగ తనపై అత్యాచారం చేయడమేకాకుండా, గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించాడని ఫిర్యాదు చేసింది. ఈ కేసులో 23 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.