గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr

మాయమాటలతో రూ.4.88 లక్షలు... మహిళ చేతిలో మోసపోయిన డాక్టర్

ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ కిలేడీ చేతిలో ఓ డాక్టర్ మోసపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... రెండు నెలల కిందట ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ తన ఖాతాలో డబ్బులు వేయించుకుని వైద్యుడిని మో

ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ కిలేడీ చేతిలో ఓ డాక్టర్ మోసపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... రెండు నెలల కిందట ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ తన ఖాతాలో డబ్బులు వేయించుకుని వైద్యుడిని మోసం చేసిన సంఘటనపై పటమట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 
 
కృష్ణా జిల్లా, విజయవాడ, అయ్యప్పనగర్‌కు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి వైద్యుడిగా పని చేస్తున్నాడు. రెండు నెలల కిందట ఆయనకు ఫేస్‌బుక్‌లో లండన్‌కు చెందిన ఓ మహిళ పరిచయమైంది. రెండు నెలలుగా ఇద్దరు ఫేస్‌బుక్‌లో ఛాటింగ్‌ చేసుకుంటున్నారు. లండన్‌ నుంచి విజయవాడ వస్తున్నానని ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్నానని ఆ మహిళ ఈ నెల 15న కృష్ణమూర్తికి ఫోన్‌ చేసి చెప్పింది. 
 
ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చేందుకు తన దగ్గర ఇండియన్‌ కరెన్సీ లేదని చెప్పింది. ఆమె విమానాశ్రయంలో నిలబడి ఉందని, 20 వేల పౌండ్లు ఉన్నాయని మరో వ్యక్తితో కూడా ఫోన్‌ చేయించి మాట్లాడించింది. తన ఖాతాకు ఇండియన్‌ కరెన్సీ పంపించాలని కోరింది. 
 
ఆ మాటలు నమ్మిన కృష్ణమూర్తి 15, 16 తేదీల్లో మొత్తం రూ.4.88 లక్షలు ఆమె చెప్పిన బ్యాంకు ఖాతాలో వేశారు. ఆ తర్వాత ఆ మహిళ నుంచి ఎటువంటి సమాచారం లేదు.. ఫోన్‌ లేదు. దీంతో మోససోయినట్లు గ్రహించిన ఆయన పటమట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.