గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Modified: సోమవారం, 10 సెప్టెంబరు 2018 (19:47 IST)

ఖరీదైన చాక్లెట్ ఆశ చూసి.. స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్...

ప్రేమ పేరుతో 10వ తరగతి బాలికను మోసం చేసి అత్యాచారం చేయడమే గాకుండా స్నేహితులనూ ఈ దారుణంలో భాగస్వామ్యం చేసిన ఘటన గుంటూరులో వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంగా బాలికపై అత్యాచారానికి పాల్పడడంతో ఎట్టకేలకు బాధితురాలు నోరు విప్పింది. గుంటూరులోని స్వర్ణభారతీ న

ప్రేమ పేరుతో 10వ తరగతి బాలికను మోసం చేసి అత్యాచారం చేయడమే గాకుండా స్నేహితులనూ ఈ దారుణంలో భాగస్వామ్యం చేసిన ఘటన గుంటూరులో వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంగా బాలికపై అత్యాచారానికి పాల్పడడంతో ఎట్టకేలకు బాధితురాలు నోరు విప్పింది. గుంటూరులోని స్వర్ణభారతీ నగర్‌కు చెందిన బాలిక నగరంపాలెం ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఆ బాలిక ఇంటి దగ్గిరలో ఉండే త్రినాథ్‌ కూలి పనులు చేస్తున్నాడు. ఆమెకు ఖరీదైన చాక్లెట్లు ఇతర బహుమతులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. 
 
ఆ తర్వాత విషయాన్ని తన స్నేహితులకూ చెప్పి సామూహికంగా అత్యాచారం చేశారు. ఈ ఘటనను చరవాణిలో చిత్రీకరించారు. ఆ విషయాన్ని బయటకి చెపితే ఆ వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్‌లో పెడతామంటూ బెదిరించారు. దీంతో ఆ బాలిక మిన్నకుండిపోయింది. కొద్ది నెలలుగా వారిద్దరు ఆ బాలికను బెదిరిస్తూ లొంగదీసుకుంటున్నారు. కొద్దిరోజుల తర్వాత త్రినాథ్ ద్వారా బాలిక విషయం తెలుసుకున్న మరో ఇద్దరు స్నేహితులు ఓ రోజు ఆమెను బెదిరించి రాజీవ్‌గృహకల్ప బహుళ నివాసాలు ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. 
 
ఏడాది కాలంగా ఇదే తరహాలో ఒకరి నుంచి మరొకరు స్నేహితులు సమాచారం చేరవేసుకొని ఆ బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడుతుండటంతో బాధితురాలు విషయాన్ని ఇంట్లో చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన గుంటూరు అర్బన్ పోలీసులు ఈ దారుణంలో ఇంకా ఎవరున్నారు అనే కోణంలో పూర్త దర్యాప్తు చేస్తున్నారు.