శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Updated : శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (14:58 IST)

తాత చంద్రబాబును ప్రశ్నించిన మనవడు దేవాన్ష్.. సమర్థించిన లోకేష్‌, బ్రహ్మిణి?

పోలవరం ప్రాజెక్టు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ప్రాజెక్టు మీదే ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి తీరాలని ఎపి ప్రభుత్వం పట్టుదలతో ఉంది. కేంద్రం నిధులు కూడా ఇస్తోం

పోలవరం ప్రాజెక్టు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ప్రాజెక్టు మీదే ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి తీరాలని ఎపి ప్రభుత్వం పట్టుదలతో ఉంది. కేంద్రం నిధులు కూడా ఇస్తోంది. అయితే అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ నేతలు మాత్రం పోలవరం ప్రాజెక్టుపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతూ విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా అన్న అనుమానం అందరిలోను కలుగుతోంది.
 
ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబుకు బాబ్లీ ప్రాజెక్టుపై నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చింది. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి ముందుగా తాఖీదు ఇవ్వకుండా ఒక్కసారిగా నాన్ బెయిల్ వారెంట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు టిడిపి నేతలు. నిన్న రాత్రి తిరుమలలో ఉన్న చంద్రబాబుకు ఈ విషయం తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు గురయ్యారు. 
 
ఒక్కసారిగా దేవాన్ష్ తన తాత చంద్రబాబు వద్ద... తాతా ఇప్పుడు ప్రాజెక్టుల గురించి గొడవ జరుగుతోందిగా... నేను నిన్ను టీవీలో చూశాను. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా అంటూ అడిగాడు. దీంతో చంద్రబాబు తన మనవడికి ఖచ్చితంగా పూర్తవుతుందని సమాధానమిచ్చారు. దేవాన్ష్ పోలవరం ప్రాజెక్టుపై తాతను ప్రశ్నించడంతో కుటుంబ సభ్యులందరూ ముక్కుపైన వేలేసుకున్నారు. అయితే లోకేష్‌, బ్రహ్మిణి మాత్ర తన కుమారుడు అడిగిన ప్రశ్నను ఆశ్చర్యపోకుండా అతన్ని సమర్థించారు. ఎంతయినా తల్లిదండ్రులు కదా?