శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 జూన్ 2018 (11:37 IST)

కట్టుకున్న భార్యను హెడ్‌కానిస్టేబులే మోసం చేశాడు.. రెండో భార్యతో సంసారం..

కట్టుకున్న భార్యను ఓ హెడ్ కానిస్టేబుల్ మోసం చేశాడు. భర్త రెండో పెళ్లి చేసుకుని చేసుకున్నాడని పదేళ్ల తర్వాత తెలిసి బాధితురాలు షాకైంది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసే ఇలా చేశాడని.. ఆశ్చర్యపోయింది.

కట్టుకున్న భార్యను ఓ హెడ్ కానిస్టేబుల్ మోసం చేశాడు. భర్త రెండో పెళ్లి చేసుకుని చేసుకున్నాడని పదేళ్ల తర్వాత తెలిసి బాధితురాలు షాకైంది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసే ఇలా చేశాడని.. ఆశ్చర్యపోయింది.


వివరాల్లోకి వెళితే.. రమావత్ తాలూకారావు అనే వ్యక్తి ప్రస్తుతం గుంటూరు జిల్లా రెంటచింతలలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రమావత్‌కు 2004 ఫిబ్రవరిలో తొలి భార్యతో వివాహం జరిగింది. వీరికి ఆరో తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలున్నారు. 
 
ఇంతలో మాచర్లలో పనిచేస్తుండగా.. ఓ కేసు విషయమై పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువతిని రమావత్ పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఆమె మాచర్లలోని రోడ్డు పక్కన బండిపై రోటీలు అమ్మకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెను తాలూకారావు పెళ్లి చేసుకుని, మొదటి భార్యకు అనుమానం రాకుండా సంసారం సాగించాడు. ఆమెతో ఓ కుమార్తె, గత నెలలో ఓ కుమారుడు జన్మించాడు. కానీ డ్యూటీ పేరుతో ఆయన సరిగ్గా ఇంటికి రావకపోవడంతో తొలి భార్యకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. 
 
దీనిపై భర్తను నిలదీయగా... తనకు మగ పిల్లలు కావాలని, అందుకే మరో యువతిని పెళ్లి చేసుకున్నానని బదులివ్వడంతో పాటు ఇద్దరితో కాపురం చేస్తానన్నాడు. అయితే భర్త చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకపోయిన బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేసింది.