శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: సోమవారం, 8 ఏప్రియల్ 2019 (14:37 IST)

రోజాకి భన్వర్ లాల్‌తో లింకా... చంద్రబాబు నీచ మనస్తత్వం: విజయమ్మ

ఎన్నికలు జరిగేందుకు మరో రెండు రోజులే మిగిలి వున్నాయి. ఈ నేపధ్యంలో నాయకుల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అనంతపురం జిల్లా నార్పల వద్ద రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ, ఏపీలో నిజమైన రౌడీ ఎవరైనా వున్నారూ అంటే అది చంద్రబాబే అని అన్నారు. 
 
రోజాతో భన్వర్ లాల్‌కు సంబంధం ఉందని బాబు చెప్పడం ఆయన నీచ మనస్తత్వానికి నిదర్శనమనీ, మహిళల మానప్రాణాలతో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు సిగ్గుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుకి తెలియని డ్రామాలు లేవనీ, ఎన్నికలు సమీపిస్తున్నందున తనకు గుండెపోటు వచ్చినట్లు డ్రామా ఆడినా ఆడుతారని అన్నారు. తన కుమారుడు జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.