శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 11 జనవరి 2019 (10:54 IST)

భర్త కిరాతక చర్య : భార్యను చంపి పూలతోటలో పూడ్చిపెట్టాడు...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని పూలతోటలో పూడ్చిపెట్టి... తన భార్య కనిపించలేదని నాటకమాడాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్‌కు చెందిన తబస్సుమ్ అనే వ్యక్తికి కొన్నేళ్ళ క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇంతలో ఏమైందో ఏమోగానీ.. మీ కుమార్తె చనిపోయింది.. అంత్యక్రియలు కూడా పూర్తి చేశానంటూ అత్తామాలకు సమాచారం చేరవేశాడు.
 
ఈ మాటలు విన్న అత్తమామలు ఒకింత షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత తేరుకుని అల్లుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. తబస్సుమ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం కక్కాడు. తన భార్యను గొంతు నులిమి హత్య చేసి చంపేసినట్టు వెల్లడించాడు. ఆ తర్వాత మృతదేహాన్ని పూలతోటలో పూడ్చిపెట్టినట్టు చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి శవపరీక్షకు పంపించారు. తబస్సుమ్‌ను అరెస్టు చేశారు.