శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (16:39 IST)

మా ఓటమికి వైఎస్ అభిమానులే కారణం : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీల నేతృత్వంలో ఏర్పాటైన ప్రజాకూటమి ఓడిపోవడానికి గల కారణాలపై తెరాస నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ అభిమానుల వల్లే ఓడిపోయినట్టు సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్, జగన్ అభిమానులు, మద్దతుదారులు భారీగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. అందువల్లే తాము ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. 
 
ఇకపోతే, తమ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అధికార తెరాసలోకి చేరుతారంటూ వస్తున్న ఊహాగానాలపై జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ తెరాసలో చేరబోరనని స్పష్టంచేశారు. అదేసమయంలో సీఎల్పీ పదవిని తనకు ఇవ్వాలని కోరనున్నట్టు చెప్పారు. ఎందుకంటే తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టు చెప్పారు. అలాగే, మెదక్ లోక్‌సభ సీటును తన భార్యకు ఇస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటానని జగ్గారెడ్డి వెల్లడించారు. 
 
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీలు పొత్తు పెట్టుకోవడానికి కారణం లేకపోలేదన్నారు. కేవలం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ రెండు పార్టీలు చేతులు కలపాల్సి వచ్చిందన్నారు. అంతేకానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని అనడం ఏమాత్రం సబబు కాదన్నారు.