శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 2 నవంబరు 2017 (18:03 IST)

ఏపీలో పెరిగిన కిడ్నీ పెన్షన్‌దారులు

అదనంగా చేరిన వారితో SERP అందిస్తున్న కిడ్నీ రోగుల పెన్షన్లు అక్టోబరు నెలలో మరో 215 పెరిగాయి. వీరికి ఇతర పెన్షన్లు ఇస్తున్నప్పటికీ ఈ సహాయం కొనసాగుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వ జులై 20వ తేదీన విడుదల చేసిన జి.ఒ. ఆగస్టు నుంచి అమలులోకి వచ్చింది. దాంతో నిరుపేద

అదనంగా చేరిన వారితో SERP అందిస్తున్న కిడ్నీ రోగుల పెన్షన్లు అక్టోబరు నెలలో మరో 215 పెరిగాయి. వీరికి ఇతర పెన్షన్లు ఇస్తున్నప్పటికీ ఈ సహాయం కొనసాగుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వ జులై 20వ తేదీన విడుదల చేసిన జి.ఒ. ఆగస్టు నుంచి అమలులోకి వచ్చింది. దాంతో నిరుపేద కిడ్నీ రోగులకు ప్రతి నెల రూ. 2,500/ఆర్థిక సహాయం అందించడానికి ఈ ఏడాది ఆగస్టులో మార్గం సుగమమైంది.
 
ఇందుకు ‘సెర్ప్’ సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించిన విషయం తెలిసినదే. దానితో సంబంధ శాఖలతో సంప్రదించిన మీదట ఆగస్టు నెల ఆర్ధిక సహాయం సెప్టెంబర్ 1 తారీఖున చెల్లించేవిధంగా ‘సెర్ప్’ చర్యలు తీసుకుంది. అయితే ఆగస్టులో 1560 మందితో మొదలయిన ఈ పెన్షన్లు అక్టోబర్ నెలలో 2,235కు పెరిగాయి. 
 
కిడ్నీ వ్యాధి స్టేజ్ 3 నుంచి 5 మధ్య ఉన్నవారిని ఇందుకు ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సహాయం అందనివారు ఉన్నట్లయితే జిల్లాల్లోని సబంధిత ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి అధికారిక సమ్మతి అందిన వెంటనే కొత్త పేషెంట్లకు కూడా  చెల్లించడం జరుగుతుందని సెర్ప్ సి.ఇ.ఒ. డా. పి. కృష్ణ మోహన్ వెల్లడించారు.